News July 31, 2024

బూర్జ: ఓవి పేట VROపై పలువురు రైతులు దాడి

image

స్థానిక వీఆర్వో వ్యాపార లక్ష్మీనారాయణపై పలువురు రైతులు మంగళవారం దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్‌లో వైద్యం పొందుతున్నారు. మంగళవారం ఉదయం తన విధుల్లో భాగంగా ఓవిపేట వెళ్తుండగా భూమి తగాదాల నేపథ్యంలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో ఉన్న ఆయనకు కళింగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు బుడుమూరు శ్రీరామ్మూర్తి, బీవీఎస్ఎన్ రాజు, వెల్ఫేర్ అసిస్టెంట్ పరామర్శించారు.

Similar News

News March 11, 2026

శ్రీకాకుళం: కొనసాగుతున్న ఏసీబీ దాడులు

image

రాష్ట్ర వ్యాప్త దాడుల్లో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం సైతం ఏసీబీ సీఐలు రమణ, భాస్కర్ రావుతో కూడిన బృందం పట్టణంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనుమతులు ఇచ్చిన భవనాలు, నిర్మాణ నిబంధనలు వంటివి పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

News March 11, 2026

శ్రీకాకుళం: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ

image

శ్రీకాకుళం మండలం జాతీయ రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద బుధవారం ఆగి ఉన్న కారును లారీ ఢీకొంది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

News March 11, 2026

శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

image

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్‌కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.