News July 31, 2024
అందులో నిర్మల్ జిల్లా TOP

మహాలక్ష్మి పథకం వినియోగానికి సంబంధించి ఆదిలాబాద్ RTC రీజియన్ వ్యాప్తంగా పరిశీలిస్తే నిర్మల్ డిపోలో అధికంగా లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. గత డిసెంబర్ నుండి జులై వరకు నిర్మల్ జిల్లాలో జీరో టిక్కెట్ తీసుకున్న మహిళలు 96.54 లక్షల మంది ఉన్నారు. మంచిర్యాలలో 78 లక్షలు, ఆదిలాబాద్లో 50 లక్షలు, బైంసాలో 56 లక్షలు, ఆసిఫాబాద్లో 49, ఉట్నూర్ పరిధిలో 16 లక్షల మంది అతివలు, బాలికలు ప్రయాణం చేశారు.
Similar News
News March 13, 2026
14న ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం : ADB కలెక్టర్

జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
News March 13, 2026
14న ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం : ADB కలెక్టర్

జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
News March 13, 2026
ఆదిలాబాద్: ఉచితంగా వెజిటబుల్ కిట్ల పంపిణీ

వెజిటబుల్ మినీ కిట్లను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఉద్యాన శాఖ ద్వారా రైతులకు ఉచితంగా అందిస్తున్న కిట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సహించడానికే ఉచిత కిట్లను అందిస్తున్నామన్నారు.


