News July 31, 2024

అందరికీ ధైర్యం చెప్పి ప్రాణాలు కోల్పోయింది!

image

ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్‌ <<13723684>>ఘటన<<>>లో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రాణాలతో బయటపడిన రిషబ్ అనే విద్యార్థి ప్రమాద సమయంలోని పరిస్థితిని మీడియాతో పంచుకున్నారు. ‘వరద నీటిలో మునిగి లైబ్రరీలో ఉన్న మేమంతా చనిపోతాం అనుకున్నాం. కానీ తన్య మాత్రం అందరికీ ధైర్యం చెప్పింది. మానవహారంగా ఏర్పడి బయటకెళ్దామని సూచించింది. కానీ, అది కుదరలేదు. చివరికి ఆమె నీటిలో మునిగి చనిపోయింది’ అని తెలిపారు.

Similar News

News March 6, 2026

ఇతనికి 60 ఏళ్లు.. నమ్ముతారా?

image

తన ఏజ్‌లెస్ లుక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ మోడల్ చువాండో టాన్ ఈ నెల 3న 60 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అరవైలో ఇరవైలా ఉండటమంటే ఇదేనని, ఇతను వ్యాంపైర్ అయి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హై ప్రొటీన్ ఫుడ్, మద్యం, ధూమపానం, చక్కెరకు దూరంగా ఉండటం, డైలీ వ్యాయామం, స్విమ్మింగ్ తన ఫిట్‌నెస్‌కు కారణమని అతను చెబుతుంటారు.

News March 6, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 6)

image

* 1899: తెలుగు రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం
* 1913: తొలితరం హాస్యనటుడు కస్తూరి శివరావు జననం
* 1917: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జననం
* 1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం
* 1933: సినీ నటి కృష్ణకుమారి జననం (ఫొటోలో)
* 1964: పిఠాపురం చివరి రాజు మహీపతి సూర్యారావు మరణం
* 2016: నటుడు కళాభవన్ మణి మరణం

News March 6, 2026

‘ఆశా’లకు కొత్త ఫోన్లు, 2 చీరలు: సత్యకుమార్

image

AP: ఆశావర్కర్లకు GOVT గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కొత్త ఫోన్లు, 2 కొత్త చీరలు ఇస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. NHM ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరే సెలవులు ఇస్తామన్నారు. దహన సంస్కారాల‌కు ₹15,000 ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1,363 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. బీమా సౌకర్యం వర్తింపునకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.