News July 31, 2024

పిచ్చి తల్లీ.. ఎంత కష్టమొచ్చిందమ్మా!

image

TG: బిడ్డకు జలుబు వచ్చినా తల్లడిల్లిపోయేదా తల్లి. అదే అమ్మ నేడు మంచాన పడితే నడిరోడ్డుపై వదిలేశాడా కొడుకు. మేడ్చల్‌కు చెందిన అరవింద్ తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఆస్పత్రికి తీసుకెళ్తానంటే పాపం అమాయకంగా వెంట వచ్చిన ఆ పిచ్చితల్లిని ఫుట్‌పాత్‌పై వదిలేశాడు. జీవచ్ఛవంలా పడి ఉన్న ఆమెను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బిడ్డ వదిలేశాడని ఇంకా నమ్మని ఆ అమ్మ, కొడుకును చూడాలని తపిస్తుండటం కంటతడి పెట్టిస్తోంది.

Similar News

News February 2, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

వసంత పంచమి పర్వదినాన్ని ఈ రోజు జరుపుకొంటున్నప్పటికీ రేపు కూడా పంచమి తిథి ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీని ప్రకారం రేపు సెలవు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు. మరి రేపు సెలవు ఉన్నట్లు మీకు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News February 2, 2025

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం HYD నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఆయన సాయంత్రం కేంద్ర మంత్రులను కలవనున్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలపనున్నారు. రేపు బీజేపీ అభ్యర్థుల తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. TG CM రేవంత్ సైతం ఢిల్లీలో నేడు, రేపు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

News February 2, 2025

వసంత పంచమి.. బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

TG: వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అక్షరాభ్యాస పూజలకు 2 గంటలు, అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వసతులు సరిగా లేవని పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.