News July 31, 2024
‘మీ దృష్టంతా ఉచిత పథకాలపైనే’.. ఢిల్లీ హైకోర్టు ఫైర్

ఢిల్లీ వరదల్లో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు మరణించడంపై హైకోర్టు మున్సిపల్ అధికారులపై మండిపడింది. ‘ఉద్యోగులకు శాలరీలు ఇచ్చేందుకే మీ దగ్గర డబ్బుల్లేవు. అలాంటప్పుడు మౌలిక వసతులు ఎలా కల్పిస్తారు? మీరు ఉచిత పథకాలను ప్రజలకు అలవాటు చేశారు. పన్నులు వసూలు చేయడంపై దృష్టి పెట్టరు. తద్వారా అభివృద్ధి జరగదు. అందుకే ఈ ప్రమాదం జరిగింది. మౌలిక వసతులు సరిగా ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు’ అని వ్యాఖ్యానించింది.
Similar News
News November 3, 2025
కట్నం వద్దు కానీ.. 10 కండీషన్స్! చదివేయండి

తనకు కట్నం వద్దు కానీ వధువు 10 కండీషన్స్కు ఓకే చెప్పాలని ఓ యువకుడు SMలో పోస్ట్ చేశాడు. 1.No PreWed షూట్, 2.లెహంగా బదులు చీర ధరించాలి, 3.సంప్రదాయ సంగీతం ఉండాలి. 4.దండలు ప్రశాంతంగా మార్చుకోవాలి. 5.పూజారి తంతును ఎవరూ ఆపరాదు. 6.ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ జోక్యం ఉండొద్దు. 7. అభ్యంతరకర పోజులు అడగొద్దు. 8.వేదికపై నో కిస్సెస్/హగ్స్. 9.పెళ్లి పగలే జరగాలి. 10.సాయంత్రానికి అప్పగింతలు పూర్తి చేయాలి.
News November 3, 2025
APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు: హిందూజా గ్రూప్

AP: రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడికి హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. లండన్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ కాగా పెట్టుబడులకు ముందుకొచ్చారు. విశాఖలో హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600MW పెంచేందుకు, రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటుపై MOU పూర్తైంది.
News November 3, 2025
కాలేజీల బంద్ కొనసాగిస్తాం: ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్

TG: కాలేజీల <<18182444>>బంద్<<>> కొనసాగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ ఛైర్మన్ రమేశ్ నాయుడు అన్నారు. ‘నిరసన ఉద్ధృతం చేస్తాం. రేపటి నుంచి జరిగే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తాం. మాకు రావాల్సిన బకాయిల్లో సగం వెంటనే విడుదల చేయాలి. NOV 8న HYDలో సభ, 11న 10L మంది విద్యార్థులతో ఛలో HYD పేరుతో నిరసన చేపడతాం. ప్రభుత్వం మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది’ అని ఆరోపించారు.


