News July 31, 2024

మద్నూర్: రూ. వెయ్యి కోసం వ్యక్తి హత్య

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో రూ. వెయ్యి కోసం ఓ వ్యక్తిని హత్య చేశారు. సీఐ నరేశ్ ప్రకారం.. మోఘ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గొండా ఈనెల 20న రుణమాఫీ డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సాయిలు.. లక్ష్మణ్ వద్ద రూ. వెయ్యి లాక్కున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో సలాబత్ పూర్ బ్రిడ్జి వద్ద లక్ష్మణ్‌ను.. సాయిలు బండరాయితో మోది హత్య చేశాడు.

Similar News

News February 7, 2025

NZB: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్  

image

రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నిటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచులకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

News February 6, 2025

NZB: రైలులోంచి పడి యువకుడు మృతి

image

రైల్లోంచి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB- జానకంపేట రైల్వే స్టేషన్ మధ్యలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్లోంచి కింద పడడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌‌‌కు సంప్రదించాలన్నారు.

News February 6, 2025

జక్రాన్‌పల్లి: విలువైన నిషేదిత మత్తు పదార్థాల దహనం

image

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 154 కేసులలో పట్టుబడిన రూ.12కోట్ల విలువైన నిషేదిత మత్తు పదార్థాలను జక్రాన్పల్లిలోని శ్రీ మెడికేర్‌లో గురువారం దహనం చేశారు. ఈ మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ అమోదించిన నిషేదిత మత్తు పదార్థాలైన 1700 కిలోల ఎండు గంజాయి, 64.27 కిలోల అల్ఫాజోలం, 72.2 కిలోల డైజీపాం, ఒక గంజాయి మొక్కను దహనం చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. 

error: Content is protected !!