News July 31, 2024
మదనపల్లె: హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు

టైర్ల కంపెనిలో పని చేయడానికి వచ్చిన కార్మికుడిని కత్తితో పొడిచి హత్యచేసి, మరొక వ్యక్తిపై దాడిచేసిన కేసులో నిందితునికి మదనపల్లె 2వ అదనపు జిల్లాజడ్జి బందెల అబ్రహాం జీవితఖైదు విధిస్తూ బుధవారం సంచలన తీర్పుచెప్పారు. ఏపీపీ, టూ టౌన్ సీఐ యువరాజ్, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాలు.. మదనపల్లి భాగ్యలక్ష్మి రైస్ మిల్లులో టైర్ల తయారీకి వచ్చిన కేరళ మణికంఠన్ను 2016లో సుబ్రహ్మణ్యం హత్యచేయడంతో శిక్ష పడింది.
Similar News
News March 4, 2026
చిత్తూరు: ఇంట్లోనే నాటు తుపాకుల తయారీ..!

అప్పట్లో అక్రమ తయారీదారులు ఒక్కో <<19299453>>తుపాకి<<>>ని రూ.7-10 వేల వరకు విక్రయించే వారు. కొన్నాళ్లుగా ఈ తుపాకుల జాడలేకున్నా తాజా ఘటనతో చిత్తూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కొందరు సోషల్ మీడియాను ఉపయోగించి ఇంట్లోనే నాటు తుపాకులు తయారు చేసుకొనే అవకాశం లేకపోలేదు. పలమనేరు, మదనపల్లె, పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లో నాటు తుపాకీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే ఎన్ని తుపాకులు బయటకు వస్తాయో చూడాలి.
News March 4, 2026
చిత్తూరులో మళ్లీ నాటుతుపాకుల వినియోగం.!

జిల్లాలో నాటుతుపాకి కలకలం రేపింది. అడవి పందులు, కుందేళ్లు, జింకలు, దుప్పివంటి వన్యప్రాణులను వేటాడి, మాంసాన్ని బెంగళూరు, చెన్నై నగరాలకు స్మగ్లింగ్ చేయడానికి నాటు తుపాకులు వినియోగించేవారు. 2020లో SP జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 500లకు పైగా నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతానికి అనుకొని ఉన్న కొన్ని గ్రామాల్లోని కంసాలీలు రహస్యంగా నాటు తుపాకులను తయారు చేసేవారు.
News March 4, 2026
చిత్తూరు: పదవుల కోసం పడిగాపులు..!

జిల్లాలో పదవుల కోసం TDP నేతల కళ్లు కాయలు కాచే పరిస్థితి నెలకొంది. CKబాబు, AS మనోహర్, దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు తమకు కార్పొరేషన్లు, లేదా పార్టీ పదవులు కావాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. పార్లమెంటరీ అధ్యక్ష పదవి ఆశించిన ఆశావహులకు రాష్ట్ర కమిటీలో స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా తమకు పదవులు ఇవ్వలేదని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.


