News July 31, 2024

రేపు అనపర్తిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన

image

అనపర్తి మండలంలో గురువారం (రేపు) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8:30 గంటలకు రామవరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తారని తెలిపారు. అనంతరం బలబద్రపురంలో మాజీ MLA నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అక్కడి నుంచి పందలపాక గ్రామానికి వెళ్లి అక్కడ వైద్యశిబిరం ప్రారంభిస్తారన్నారు.

Similar News

News April 4, 2026

పులిని బంధించేందుకు నెలకోట చేరిన మహారాష్ట్ర బృందం

image

పోలవరం(D) నేలకోట కొండ వద్ద మకాం వేసిన పులిని బంధించేందుకు మహారాష్ట్ర నుంచి 12 మంది సభ్యుల బృందాన్ని శుక్రవారం ఏలూరు, రంపచోడవరం, రాజమహేంద్రవరం అటవీశాఖ అధికారులతో కలిసి నేలకోట, గండికోట మధ్యలో బృందం మాటువేసింది. పెదకొండేపూడిలో గోశాల వద్ద మరో బృందాన్ని ఉంచారు. ఈ రాత్రికి పులిని బంధించడం లేదా రిజర్వు ఫారెస్టు వైపు పులిని దారి మళ్లించేలా ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.

News April 4, 2026

తూ.గో: రైతులకు మంత్రి మనోహర్ భరోసా..!

image

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

News April 4, 2026

తూ.గో: రైతులకు మంత్రి మనోహర్ భరోసా..!

image

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.