News July 31, 2024
కేరళ విపత్తు.. 250మందికి పైగా మృతి!

కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 250మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 150కి పైగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. ఆస్పత్రుల్లో 200 మందికి పైగా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు.
Similar News
News January 2, 2026
సంక్రాంతికి ‘ఫ్రీ టోల్’పై AP నుంచి విజ్ఞప్తులు

సంక్రాంతికి ‘ఫ్రీ టోల్’కు అనుమతించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రమంత్రి నితిన్ <<18713147>>గడ్కరీకి లేఖ<<>> రాసిన విషయం తెలిసిందే. తాజాగా TDP MP సానా సతీష్ బాబు కూడా గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ‘పండుగ వేళ AP-TG మధ్య వసూళ్లు రద్దు చేసి ఫ్రీ టోల్ ప్రయాణానికి అనుమతివ్వాలి. HYD–VJA కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. దయచేసి APకి వచ్చేవారి ప్రయాణాన్ని సుఖమయం చేయాల్సిందిగా విజ్ఞప్తి’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2026
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ తెలుగు-5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ తన ప్రియురాలిని పరిచయం చేశారు. కొంతకాలంగా తన రిలేషన్షిప్ స్టేటస్పై సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ‘gods plan❤️’ అంటూ తన ప్రియురాలితో ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. అయితే ఆమె ఫేస్, పేరు రివీల్ చేయలేదు. ఆయనకు అభిమానులు, ఫాలోవర్స్ అభినందనలు చెబుతున్నారు. 2021లో యూట్యూబర్ దీప్తి సునయనతో బ్రేకప్ అయిన విషయం తెలిసిందే.
News January 2, 2026
BSNL వార్షిక ప్లాన్.. రూ.2,799తో డైలీ 3GB

యూజర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL అతి తక్కువ ధరకే వార్షిక ప్లాన్ను స్టార్ట్ చేసింది. రూ.2,799తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల పాటు రోజుకు 3GB డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాల్స్ లభించనున్నట్లు ప్రకటించింది. ప్రైవేట్ టెలికం సంస్థలతో పోల్చితే ఇదే తక్కువ కావడం విశేషం. గతంలో ఈ ప్లాన్ ధర రూ.2,399 (డైలీ 2GB)గా ఉండేది. 5Gతో పాటు వేగవంతమైన ఇంటర్నెట్ అందించాలని యూజర్లు కోరుతున్నారు.


