News July 31, 2024
హైదరాబాద్: పంజాగుట్టలో ACB రైడ్స్

నగరంలోని పంజాగుట్ట సర్కిల్ ప్రాంతంలో ACB అధికారులు రైడ్స్ చేశారు. పంజాగుట్ట సర్కిల్ వన్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.2,00,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫైనల్ ఆడిట్ క్లియర్ చేసేందుకు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు రావడంతో రైడ్స్ చేసినట్లు వెల్లడించారు.
Similar News
News November 9, 2025
HYD: అమ్మాయిలతో అసభ్యంగా రీల్స్.. జాగ్రత్త!

SMలో పిచ్చి పిచ్చి రీల్స్ పోస్ట్ చేసేవారిపై HYD పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా యువతితో రొమాన్స్ చేస్తూ ఆటో నడిపిన ఘటనపై చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పబ్లిక్ ప్లేస్లో అసభ్యకరమైన చేష్టలతో రీల్స్ చేసి SMలో అప్లోడ్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పబ్లిక్లో పరువు పోయేలా వికృత రీల్స్ చేసి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కించకండి. SHARE IT
News November 9, 2025
జూబ్లీ బైపోల్: ఓటర్లు, పోలింగ్ బూత్ల వివరాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎల్లుండి జరగనుంది. పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య: 4,01,365. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 226 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద రెండంచల భద్రత ఏర్పాటు చేస్తారు. ఉప ఎన్నికలో 58 అభ్యర్థులు(+నోటా) పోటీ చేస్తున్నారు. INC-BRS-BJP మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.
News November 9, 2025
బస్తీల్లో జూబ్లీహిల్స్ ‘పవర్’!

బస్తీలు అని చిన్న చూపు చూడకండి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి అవి ఎదిగాయి. పేరుకే జూబ్లీహిల్స్.. కానీ లోపల మాత్రం పక్కా మాస్. భవంతులు కట్టిన బడాబాబులు కాదు.. గల్లీ ఓటర్లే ఇక్కడ MLAను డిసైడ్ చేస్తారు. కుల రాజకీయం అస్సలే కలిసిరాదు. నియోజకవర్గంలో మైనార్టీలు సింహభాగం(30%) అయితే.. వారు కూడా నివసించేది ఈ బస్తీల్లోనే. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బస్తీలు కింగ్మేకర్గా మారాయి.


