News July 31, 2024

తిరుపతి జిల్లాలో ఐదేళ్లలో 3746 మంది మిస్సింగ్

image

అవును ఇది అక్షరసత్యం. గడిచిన ఐదేళ్లలో తిరుపతి జిల్లాలో 3746 మంది మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఇందులో బాలికలు 1389 మంది, 2357 మంది యువతులు, మహిళలు ఉన్నారు. అలాగే గడిచిన ఐదేళ్లలో 3848 మంది ఆచూకీ గుర్తించారు. ఇందులో 1420 మంది బాలికలు, 2418 మంది యువతులు ఉన్నారు. 2019 ముందు కేసులను కలపడంతోనే ఐదేళ్లలో ఆచూకీ దొరికన వారి సంఖ్య పెరిగింది.

Similar News

News March 11, 2026

చిత్తూరులో 13న ముస్లింలకు ఇఫ్తార్ విందు

image

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు “ఇఫ్తార్ విందు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీ శుక్రవారం 5:30 గం.లకు చిత్తూరు నగరంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలోని ఉర్దూ షాదీ మహల్‌లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ విందు ఏర్పాటు చేశారు.

News March 11, 2026

చిత్తూరు జిల్లా అధికారులు తనిఖీలు చేసేనా?

image

గ్యాస్ డిమాండ్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో 46 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 6లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ల పంపిణీని నిలిపివేయడంతో గృహ అవసరాల సిలిండర్లని హోటళ్లకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు గ్యాస్ పక్కదారి పట్టకుండా షాపులపై తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది.

News March 11, 2026

చిత్తూరు: మల్చింగ్ పేపర్ ధరకు రెక్కలు

image

చిత్తూరు జిల్లాలో పలువురు రైతులు మల్చింగ్ పేపర్‌తో సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. టమాటా సాగులోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో ముడి సరుకుల ధర పెరగడంతో మల్చింగ్ ధరకు రెక్కలు వచ్చాయి. గతేడాది ఓ రోల్ రూ.2300 ఉండగా ప్రస్తుతం రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.