News July 31, 2024

రేపట్నుంచి ప్రజలకు అందుబాటులో జనసేన ప్రజాప్రతినిధులు

image

AP: పార్టీ ఎంపీలు, MLAలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారని జనసేన తెలిపింది. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారని పేర్కొంది. ఒక్కో ప్రజాప్రతినిధి రెండ్రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారంది. ఈ మేరకు జనసేన కార్యాలయంలో అందుబాటులో ఉండే నేతల వివరాలను పార్టీ వెల్లడించింది. పైన ఫొటోల్లో ఆ జాబితా చూడొచ్చు.

Similar News

News March 25, 2026

ఓటీటీలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

image

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 మూవీ OTT రిలీజ్ ఖరారైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ రాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.13 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

News March 25, 2026

నిరుద్యోగులుగా గ్రాడ్యుయేట్లు.. స్కిల్స్ పెంచుకోండి!

image

ఇండియాలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం దొరకడం సవాలుగా మారింది. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ రిపోర్ట్ 2026’ ప్రకారం 20-24ఏళ్ల గ్రాడ్యుయేట్లలో 39%, 25-29ఏళ్ల వారిలో 20శాతం నిరుద్యోగులు ఉన్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ పెంచుకుంటే ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. టెక్నికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తోడైతే అవకాశాలు వాటంతట అవే వస్తాయంటున్నారు.

News March 25, 2026

సిద్దిపేటలో పోటీకి ఎవరో ఎందుకు రేవంతే రావచ్చు: హరీశ్ సవాల్

image

TG: తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ CM కాలేడని BRS నేత హరీశ్ విమర్శించారు. ‘ఏ టైమ్‌లో గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు. వచ్చే ఎన్నికల్లో గోల్ కొట్టేది మేమే. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా BRSదే గెలుపు. KCR CM. సిద్దిపేటలో పోటీకి ఎవరినో పెట్టడం ఎందుకు రేవంత్ రెడ్డే రావచ్చు’ అని సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహణలో GOVT విఫలమైందని, ప్రజాసమస్యలపై చర్చే లేదని మీడియాతో చిట్ చాట్‌లో విమర్శించారు.