News July 31, 2024

రేపట్నుంచి ప్రజలకు అందుబాటులో జనసేన ప్రజాప్రతినిధులు

image

AP: పార్టీ ఎంపీలు, MLAలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారని జనసేన తెలిపింది. ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారని పేర్కొంది. ఒక్కో ప్రజాప్రతినిధి రెండ్రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారంది. ఈ మేరకు జనసేన కార్యాలయంలో అందుబాటులో ఉండే నేతల వివరాలను పార్టీ వెల్లడించింది. పైన ఫొటోల్లో ఆ జాబితా చూడొచ్చు.

Similar News

News February 2, 2025

అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు: KTR

image

TG: ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను KCR తన పదేళ్ల పాలనతో దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని KTR అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న వార్తలను Xలో పోస్ట్ చేశారు. ‘ఇది ప్రజాపాలన కాదు. ప్రజలను వేధించే పాలన. జాగో తెలంగాణ జాగో’ అని పేర్కొన్నారు.

News February 2, 2025

90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే: సచిన్

image

విలువలు పాటించే విషయంలో తనకు తన కుటుంబం ఎంతో మద్దతునిచ్చిందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. నమన్ అవార్డ్స్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ’90వ దశకం మధ్యలో రెండేళ్లు నేను బ్యాట్ కాంట్రాక్టు లేకుండా ఆడాను. ఆ సమయంలో ఆల్కహాల్, టొబాకో కంపెనీలు తమ ప్రచారం కోసం బ్యాట్‌లను మాధ్యమంగా వాడుకున్నాయి. అందుకే వాటిని ప్రోత్సహించొద్దని మా ఇంట్లో డిసైడ్ అయ్యాం. 90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే’ అని వెల్లడించారు.

News February 2, 2025

GBS కలకలం.. పెరుగుతున్న మరణాలు

image

మహారాష్ట్రలో గిలియన్ బార్ సిండ్రోమ్‌తో మరో మరణం సంభవించింది. నాందేడ్‌లో 60 ఏళ్ల వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆ రాష్ట్రంలో GBS మరణాల సంఖ్య 5కు పెరిగింది. మరోవైపు పుణేలో కేసుల సంఖ్య 149కి చేరింది. తాజాగా అస్సాంలో తొలి GBS మరణం నమోదైంది. ఇటీవల తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన <<15316737>>ఓ మహిళ<<>> ఈ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.