News August 1, 2024

ప్రైవేట్ ఏజెన్సీల బకాయిలు రూ.1025 కోట్లు: సీఎంతో అధికారులు

image

AP: ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులకు భారం లేకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మైనింగ్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో మైనింగ్ శాఖపై 7 శాతం ఆదాయమే వచ్చినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు చెల్లింపులు చేయలేదన్నారు. ప్రభుత్వానికి రూ.1025 కోట్లు చెల్లించలేదని తేల్చారు. ఈ అక్రమాలపై కేసులు నమోదు చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు.

Similar News

News November 9, 2025

మనిషికి సంస్కారం ఎందుకు ఉండాలి? అదెలా వస్తుంది?

image

శరీర మలినాన్ని స్నానం తొలగించినట్లే, జీవులకు అంటిన అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించి, సద్గుణాలు ప్రసాదించేదే నిజమైన సంస్కారం. ఈ కర్మ బాహ్య శుద్ధి కాదు, ఆత్మ శుద్ధి. మనస్సుకు, బుద్ధికి జ్ఞానంతో సంస్కారం చేయడం ద్వారానే మానవుడు దివ్యత్వాన్ని పొందగలడు. ఆచారాలు, సత్కర్మల ద్వారా మనసును సంస్కరించుకుని, ఉత్తమ జీవనం సాగించడమే మన లక్ష్యం. సంస్కారాన్ని తల్లిదండ్రులు, వేదాల పఠనంతో పొందవచ్చు. <<-se>>#VedikVibes<<>>

News November 9, 2025

గంగూలీ ICC అధ్యక్షుడు అవుతారు: మమతా బెనర్జీ

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒక రోజు ICC ప్రెసిడెంట్ అవుతారని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో WWC విన్నర్ రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కొన్ని విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడుతానని, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీనే ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా గతంలో ఆయన BCCI అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

News November 9, 2025

గుకేశ్‌కు షాక్.. చెస్ వరల్డ్ కప్‌లో ఓటమి

image

గోవా వేదికగా జరుగుతోన్న చెస్ వరల్డ్ కప్‌లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్ తగిలింది. మూడో రౌండ్‌లో ఫ్రెడరిక్ స్వాన్(జర్మనీ) చేతిలో 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, అర్జున్, హరికృష్ణ, ప్రణవ్ తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు.
* ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్ చెస్ ఛాపింయన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రాహుల్.. భారత్ తరఫున 91వ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు.