News August 1, 2024
భట్టి గారు.. సత్యం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది: కార్తీక్

TG: సబితా ఇంద్రారెడ్డి అధికారం కోసం పార్టీ మారారంటూ డిప్యూటీ CM భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ఆమె కుమారుడు కార్తీక్ Xలో స్పందించారు. ‘YSR మరణం తర్వాత మా అమ్మపై CBI కేసులు పెట్టించారు. 2014, 2018 ఎన్నికల్లో కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పి మాకు అన్యాయం చేశారు. రాజకీయ సమాధి చేయాలని కాంగ్రెస్ వాళ్లే ప్రయత్నిస్తుంటే పార్టీ మారాము. సత్యం తెలుసుకుని భట్టి మాట్లాడితే బాగుంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 4, 2026
అరుదైన రికార్డుకు వికెట్ దూరంలో బుమ్రా

రేపు T20 WCలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచులో బుమ్రా ఒక్క వికెట్ తీస్తే ఓవరాల్గా 500 వికెట్ల క్లబ్లో చేరనున్నారు. దీంతో ఈ రికార్డ్ సృష్టించిన 8వ భారత బౌలర్గా నిలుస్తారు. ఇప్పటివరకు Tests 234, ODIs 149, T20 116 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్లలో కుంబ్లే(956) అత్యధిక వికెట్ టేకర్ కాగా తర్వాతి స్థానాల్లో అశ్విన్(765), హర్భజన్(717), కపిల్(687), జడేజా(634), జహీర్ ఖాన్(610), శ్రీనాథ్(551) ఉన్నారు.
News March 4, 2026
యుద్ధం.. 1,097 మంది ఇరానియన్లు మృతి

ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 1,097 మంది పౌరులు చనిపోయినట్లు USకు చెందిన హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. వీరిలో 10 ఏళ్లలోపు పిల్లలు 181 మంది ఉన్నట్లు తెలిపింది. లెక్కలోకి రాని మృతులు, గాయపడిన వారి సంఖ్య కూడా వందల్లో ఉంటుందని పేర్కొంది. కాగా ఇరాన్లోని కీలక స్థావరాలపై US అటాక్ చేస్తుండగా, ఇజ్రాయెల్తోపాటు ఇరాక్, కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి కొనసాగిస్తోంది.
News March 4, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలు

<


