News August 1, 2024
జనగణనలో కేంద్ర వైఫల్యం: సోనియా

2021లో జరగాల్సిన జనగణనను ఇప్పటికీ చేపట్టలేదని, కేంద్రానికి ఆ ఉద్దేశమే లేదని CPP ఛైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. కేంద్ర వైఫల్యంతో దేశంలోని జనాభా ఎంతో తెలియడం లేదన్నారు. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 12 కోట్ల మంది, ముఖ్యంగా SC, STలు ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. CPP మీటింగ్లో మాట్లాడుతూ.. రైతులు, యువత డిమాండ్లను బడ్జెట్లో పట్టించుకోలేదని మండిపడ్డారు.
Similar News
News September 18, 2025
గుంటూరులో డయేరియా కేసులు

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<