News August 1, 2024

పారిస్ ఒలింపిక్స్.. నేడు నిఖత్ మ్యాచ్

image

పారిస్ ఒలింపిక్స్ లో నేడు నిజామాబాద్‌కు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ మ్యాచ్ జరనుంది. మహిళల 50కేజీల ప్రిక్వార్టర్స్ మ్యాచులో నిఖత్.. వుయుతో తలపడనుంది. మధ్యాహ్నం 2.31కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా మెుదటి మ్యాచులో నిఖత్.. జర్మనీ క్రీడాకారిణిని మట్టికరిపించిన విషయం తెలిసిందే. ALL THE BEST

Similar News

News January 13, 2026

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీ సమీక్ష

image

రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులతో సిపి సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News January 13, 2026

NZB: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నిరుద్యోగ యువతకు ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్సీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజగంగారం తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి జూలై 19 వరకు 5 నెలల పాటు గ్రూప్-1, 2, 3, 4తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 13, 2026

NZB: బెట్టింగ్ భూతం.. తీసింది ప్రాణం

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌ వ్యసనం ఓ యువకుడి ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనెపల్లికి చెందిన పెరుమండ్ల సంజయ్(28) గత కొంతకాలంగా బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక, అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఉన్నకాస్తా పోవడంతో మనస్తాపానికి గురైన సంజయ్.. మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందిన కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం నిండింది.