News August 1, 2024
శ్రీశైలానికి సీఎం.. నంద్యాల ఎస్పీ హై అలర్ట్

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి ఇవాళ CM చంద్రబాబు రానున్నారు. కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హై అలర్ట్ ప్రకటించారు. 11 సెక్టార్ల పరిధిలో 1100 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా ఇప్పటికే శ్రీశైలం అడవులు అన్నింటినీ జల్లెడ పట్టినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా స్పష్టం చేశారు.
Similar News
News March 20, 2026
రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రభుత్వ పథకాల పేరుతో వస్తున్న నకిలీ కాల్స్, లింక్స్పై రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
తెలియని వ్యక్తులకు ఓటీపీ, బ్యాంక్ వివరాలు చెప్పొద్దని, అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.
News March 20, 2026
రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రభుత్వ పథకాల పేరుతో వస్తున్న నకిలీ కాల్స్, లింక్స్పై రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
తెలియని వ్యక్తులకు ఓటీపీ, బ్యాంక్ వివరాలు చెప్పొద్దని, అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.
News March 18, 2026
ఈనెల 21న రగ్బీ మహిళల ఛాంపియన్షిప్ పోటీలు

ఈనెల 21, 22వ తేదీల్లో కర్నూలు శివారులోని రిడ్జ్ పాఠశాల క్రీడా మైదానంలో ఏపీ స్టేట్ అస్మిత రగ్బీ మహిళల ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రగ్బీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.రామాంజనేయులు బుధవారం వెల్లడించారు. అండర్-15 సబ్ జూనియర్ విభాగంలో బాలికలకు, సీనియర్ విభాగంలో మహిళలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు కప్పు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు.


