News August 1, 2024

తెలంగాణకు రైల్వే లైన్లు మంజూరు చేయండి: రఘునందన్

image

తెలంగాణకు కొత్త రైల్వేలైన్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్‌కు, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు కొత్త లైన్లు ప్రారంభించాలని కోరారు. HYD MMTS విస్తరణపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా రాబట్టి ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News November 5, 2025

ఇది ట్రంప్‌కు వార్నింగ్ బెల్!

image

USలోని పలు రాష్ట్రాల్లో జరిగిన కీలక ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ట్రంప్ ఏమాత్రం ఇష్టపడని సోషలిస్ట్, కమ్యూనిస్టు భావజాలం ఉన్న జోహ్రాన్ మమ్‌దానీ <<18202940>>న్యూయార్క్ మేయర్‌గా<<>> ఎన్నికయ్యారు. వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల <<18202619>>గవర్నర్<<>> ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో రిపబ్లికన్ పార్టీ నెగ్గడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

News November 5, 2025

వర్జీనియా LGగా హైదరాబాదీ మహిళ

image

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ(డెమోక్రాట్) విజయం సాధించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. హష్మీ 1964లో HYDలో జన్మించారు. మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో నివసించారు. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జార్జియాకు వెళ్లి స్థిరపడ్డారు. బీఏ ఆనర్స్, సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. 1991లో రిచ్‌మండ్‌కు వెళ్లిన ఆమె 30 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు.

News November 5, 2025

వరి మాగాణుల్లో నువ్వులు, ఆవాలు ఎప్పుడు చల్లుకోవాలి?

image

రాయలసీమ జిల్లాల్లో నల్లరేగడి నేలల్లో వరి కోసే 10 రోజులకు ముందు ఆవాలు, నువ్వుల విత్తనాలను పొలంలో వెదజల్లాలి. ఆవాలు ఎకరాకు 1 నుంచి 1.5కిలోలు, నువ్వులు ఎకరాకు 1.5 నుంచి 2 కిలోలు అవసరం. ఆవాల విత్తనాలను 5-6 కిలోల సన్నని ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా వెదజల్లాలి. ఆ సమయంలో బురద పదునులో విత్తనాలు వారంలో మొలకెత్తుతాయి. నువ్వుల విత్తనాలను 1.5kg బియ్యపు నూకలతో కలిపిచల్లితే సమానంగా పొలంలో పడతాయి.