News August 1, 2024

4455 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

దేశంలోని 11 బ్యాంకుల్లో 4455 PO/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తు, ఫీజు చెల్లింపులు చేయవచ్చు. అక్టోబర్‌లో ప్రిలిమ్స్ జరుగుతాయి. అదే నెల లేదంటే నవంబర్‌లో ఫలితాలు విడుదల చేస్తారు. నవంబర్‌లో మెయిన్స్ నిర్వహించి.. డిసెంబర్/జనవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. జనవరి/ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News November 10, 2025

బిహార్: 122 స్థానాల్లో 1,302 మంది బరిలోకి

image

బిహార్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు పోలింగ్ జరగనుండగా సుమారు 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 136 మంది మహిళలు కావడం గమనార్హం. 45,399 కేంద్రాలలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ 122 స్థానాల్లో బీజేపీ 42, ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకుంది.

News November 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 10, 2025

పవన్ పర్యటనలో అపశ్రుతిపై కలెక్టర్ క్లారిటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో కాన్వాయ్ మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ స్పష్టం చేశారు. పర్యటనలో జనాల తాకిడికి మహిళ సృహతప్పి పడిపోగా తొక్కిసలాటలో కాలికి గాయమైందన్నారు. బాధితురాలిని వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎడమ కాలుకు చిన్న గాయమైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.