News August 1, 2024
విశాఖకు మెట్రో రైలు మంజూరు చేయాలి: కలిశెట్టి

APలో వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం నగరానికి మెట్రో రైలును మంజూరు చేయాలని విజయనగరం MP అప్పలనాయుడు కేంద్రాన్ని కోరారు. రైల్వే బడ్జెట్పై లోక్సభలో ఆయన మాట్లాడారు. ఈ మెట్రో ప్రాజెక్టును భోగాపురం ఎయిర్పోర్టు, పైడిభీమవరం ఇండస్ట్రియల్ కారిడార్ వరకు విస్తరించాలన్నారు. అలాగే చీపురుపల్లి రైల్వేస్టేషన్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లను ఆపి ప్రయాణికులకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 11, 2026
శ్రీరాముడిని ‘కోదండ రాముడు’ అని ఎందుకు పిలుస్తారు?

శ్రీరామచంద్రుని ధనుస్సు పేరు కోదండం. ఇది వెదురుతో తయారైనట్లు చెబుతారు. బరువు నూరు కిలోలని ప్రతీతి. వనవాసంలో దండకారణ్యంలో రాక్షస సంహారం కోసం దీనిని ధరించాడని పురాణ వచనం. సముద్రుడిపై ఆగ్రహించినప్పుడు ప్రయోగించిన కోదండ బాణం అజేయమైనది. రాముడు ఈ కోదండ విల్లుతోనే రావణాసురుడిని, అతని సైన్యాన్ని అంతం చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఆయనను ‘కోదండ రాముడు’ అని కొలుస్తారు.
News March 11, 2026
నేడు బుధాష్టమి.. ఏం చేయాలంటే?

బుధవారం, అష్టమి తిథి కలిసి వస్తే ఆరోజు ‘బుధాష్టమి’. ఇది శివకేశవులిద్దరికీ ప్రీతికరమని ప్రతీతి. నేడు పాటించే కొన్ని పరిహారాలతో కైవల్యప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉపవాసం ఉండాలి. బుధ ప్రతిమను కలశంపై ఉంచి పెసరపప్పు నైవేద్యం సమర్పించాలి. 8 బుధాష్టములు ఇలా చేస్తే పూర్వజన్మ పాపాలు తొలుగుతాయి. బుధ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది’ అని సూచిస్తున్నారు.
News March 11, 2026
చైనా FDIలు.. వ్యూహాత్మక గాలమా?

గల్వాన్ ఘర్షణ తర్వాత టిక్టాక్ బ్యాన్, చైనా వస్తువుల బహిష్కరణతో దేశం హోరెత్తిపోయింది. కానీ నేడు సీన్ మారింది. చైనా కంపెనీల <<19346681>>పెట్టుబడులకు<<>> (FDI) కేంద్రం రూల్స్ మార్చింది. ఇది వ్యూహాత్మక మార్పా? లేక ఆర్థిక అవసరమా? అనే చర్చ జరుగుతోంది. దేశీయ తయారీ రంగం బలోపేతం కోసం డ్రాగన్తో చేతులు కలిపిందని పలువురు విశ్లేషిస్తున్నారు. అలాగే చైనాను దారితెచ్చుకోవడానికి వేసిన గాలం అని మరికొందరు అంటున్నారు.


