News August 1, 2024
SC వర్గీకరణ: నెరవేరిన మందకృష్ణ కల

SC వర్గీకరణ అంటే గుర్తొచ్చేది మందకృష్ణ మాదిగ. విద్య, ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతోందని MRPS స్థాపించి ప్రజల్లో అవగాహన కల్పించారు. నాయకుల్ని తయారు చేశారు. నిరాహారదీక్షలు చేశారు. రాజకీయ నేతల్ని కలిసి పార్టీలకు మద్దతిచ్చారు. వేర్వేరు సంఘాలు ఏర్పడి విభజన రాజకీయాలు రాజ్యమేలినప్పుడు మొక్కవోని దీక్షతో ఒంటరిగా పోరాడారు. కన్నీరు కార్చారు. మొన్న మోదీకి మద్దతిచ్చారు. సుప్రీం తీర్పుతో విజయం చవిచూశారు.
Similar News
News November 7, 2025
SBI అరుదైన ఘనత

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.
News November 7, 2025
చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్పూర్లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.
News November 7, 2025
నరసాపురం వరకు వందేభారత్ రైలు

AP: చెన్నై సెంట్రల్- విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఈ రైలు 5.30AMకు చెన్నైలో బయలుదేరి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు చేరుతోంది. ఇకపై అక్కడి నుంచి గుడివాడ, భీమవరం మీదుగా నరసాపురానికి 2.10PMకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 3.20PMకు బయలుదేరి 11.45PMకు చెన్నైకి వెళ్తుంది.


