News August 1, 2024

ఏయూ: జబ్లింగ్ విధానంలో ఎంసీఏ పరీక్షల

image

ఏయు పరిధిలో ఎంసీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 12 నుంచి జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు ఏ.సీ.ఈ జె.రత్నం తెలిపారు. నోబెల్ ఇన్స్టిట్యూట్, ఏక్యూజే కాలేజ్, డాక్టర్ ఎల్.బి కాలేజ్, సాంకేతిక విద్యా పరిషత్, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ కళాశాల విద్యార్థులు ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో, బొబ్బిలి ఆర్ఎస్ ఆర్కే ఆర్ఆర్ కాలేజ్ విద్యార్థులు, బొబ్బిలి శ్రీగాయత్రి డిగ్రీ కాలేజీలో పరీక్షలకు హాజరవుతారు.

Similar News

News March 5, 2026

విశాఖ విచ్చేసిన మంత్రి నారా లోకేశ్

image

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం మధ్యాహ్నం విశాఖ విచ్చేశారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విశాఖ వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ సోదరుని కుమారుడి వివాహ వేడుకకు హాజరుకావడానికి లోకేశ్ వచ్చారు.

News March 5, 2026

ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

image

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

News March 5, 2026

విశాఖలో నడిరోడ్డుపై మృతదేహం

image

విశాఖలో నడిరోడ్డుపై వ్యక్తి విగతజీవిగా పడిఉన్నాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గంటల తరబడి మృతదేహం అలాగే ఉన్నా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోలేదు. ఇసుకతోట జంక్షన్ వెంకజిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గంటల తరబడి మృతదేహం అలానే ఉంది.