News August 1, 2024
శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP UPDATES

✦ శ్రీకాకుళం జిల్లాలో 97.50 శాతం పెన్షన్ల పంపిణీ✦ నిమ్మాడ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం✦ రైల్వే సమస్యలపై లోక్ సభలో ప్రస్తావించిన ఎంపీ కలిశెట్టి✦ జిల్లావ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం✦ పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి:కలెక్టర్✦ శ్రీకాకుళంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి✦ డిగ్రీ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ నమోదు ప్రారంభం✦ జిల్లాలో 39 మంది తహశీల్దార్లకు పోస్టింగ్.
Similar News
News March 17, 2026
శ్రీకాకుళం: రేపటి నుంచి దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటినుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి అప్పలనారాయణ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. అయితే సంబంధిత దివ్యాంగులు శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్టీసీ బస్టాండ్లో మూడు సంవత్సరాలకు ఒక పాస్ను పొందవలసి ఉంటుందన్నారు.
News March 17, 2026
నందిగాం: తృటిలో తప్పిన పెను ప్రమాదం

నందిగాం మండలం లట్టిగాం సమీపంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలాస నుంచి 49 మంది ప్రయాణికులతో శ్రీకాకుళం వెళ్తున్న పల్లె వెలుగు బస్సు రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద ఆగడంతో వెనుక నుంచి వస్తున్న ట్రావెల్ బస్సు ఢీకొంది.
News March 17, 2026
శ్రీకాకుళం: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

మందస మండలంలోని పిడిమందస గ్రామానికి చెందిన సేనాపతి విక్రమ్ కుమార్ ఒకేసారి మూడు ఉద్యోగాలను సాధించాడు. సామాన్య పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన చదువు ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ క్లర్క్(కర్ణాటక), ఐబీపీఎస్ క్లర్క్, కెనరా బ్యాంక్, కర్ణాటక, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానికులు అభినందనలు తెలిపారు.


