News August 2, 2024
ఆగస్టు 2: చరిత్రలో ఈరోజు

✒ 1861: రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ జననం
✒ 1876: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జననం
✒ 1880: నాటక దర్శకుడు, లాయర్ బళ్లారి రాఘవ జననం
✒ 1922: టెలిఫోన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ మరణం
✒ 1924: స్త్రీవాద రచయిత్రి, సంపాదకురాలు మల్లాది సుబ్బమ్మ జననం
✒ 1944: అవధాని, కవి ఆశావాది ప్రకాశరావు జననం
✒ 1966: మాజీ క్రికెటర్ ఎం.వి.శ్రీధర్ జననం
✒ 1979: మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ జననం
Similar News
News January 26, 2026
తక్కువ పంట కాలం, అధిక ఆదాయం.. బీర పంటతో సొంతం

సీజన్తో పనిలేకుండా ఏడాది పొడవునా పండే కూరగాయల్లో బీర ముఖ్యమైంది. ఇది తక్కువ సమయంలోనే చేతికి వస్తుంది. పైగా మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. పందిరి విధానంలో బీర సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పంటకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. బీర పంట సాగు, అధిక ఆదాయం రావడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News January 26, 2026
కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 26, 2026
ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్కు పద్మశ్రీ

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్కు బ్రాండ్ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.


