News August 2, 2024

గ్రేటర్ వరంగల్‌లో పెరిగిన కాంగ్రెస్ బలం

image

వరంగల్ మహానగర పాలకసంస్థ పాలకవర్గంలో అధికార కాంగ్రెస్ బలం పెరిగింది. గురువారం తూర్పు నియోజకవర్గానికి చెందిన BRS కార్పొరేటర్లు పల్లం పద్మ, సోమిశెట్టి ప్రవీణ్, జోగి సువర్ణ హస్తం గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 7 నుంచి 39కి పెరిగింది. BRS బలం 39 నుంచి 17కు తగ్గింది. BJP 10 నుంచి 11కు పెరిగింది. కాగా, తూర్పులో BRS కార్పొరేటర్ల చేరికలపై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 1, 2024

నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా

image

వరంగల్ జిల్లా క్రిస్టియన్ కాలనీలోని సీబీసీ చర్చి నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. అనంతరం మంత్రి దంపతులను పలువురు సభ్యులు ఘనంగా సన్మానించారు.

News October 1, 2024

WGL: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

వరంగల్: మార్కెట్లో పత్తి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర తటస్తంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7450 పలకగా… నేడు కూడా అదే ధర పలికింది. అలాగే ఈరోజు మార్కెట్ తరలిరాగా రూ. 6910 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గత వారంతో పోలిస్తే ధరలు పడిపోయాయని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.