News August 2, 2024

రైతులకు గుడ్‌న్యూస్

image

AP: రైతుల కోసం నేటి నుంచి సూక్ష్మసేద్య పథకం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు తన వాటా డబ్బు చెల్లిస్తే, వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అమలుకు తొలుత అధికారులు నిర్ణయించారు. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలన్న CM ఆదేశాలతో 7.50 లక్షల ఎకరాలకు పెంచారు. పరికరాలు సమకూర్చేలా 33 కంపెనీల ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు.

Similar News

News February 3, 2025

వచ్చే వారం 4 ఐపీవోలు

image

మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు ఈ నెల 4-10వ తేదీల మధ్య నాలుగు కంపెనీలు IPOకు రానున్నాయి. ఎలిగాంజ్ ఇంటీరియర్స్ రూ.78.07 కోట్లు, అమ్విల్ హెల్త్ కేర్ రూ.59.98 కోట్లు, రెడ్‌మిక్స్ కన్‌స్ట్రక్షన్ రూ.37.66 కోట్లు, చాముండా ఎలక్ట్రానిక్స్ రూ.14.60 కోట్లు సేకరించనున్నాయి. అలాగే డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్, మల్పాని పైప్స్ కంపెనీలు లిస్ట్ కానున్నాయి.

News February 3, 2025

జస్టిస్ చంద్రచూడ్ నివాసానికి మోదీ.. జస్టిస్ రాయ్ కీలక వ్యాఖ్యలు

image

సుప్రీంకోర్టు మాజీ CJI జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో PM మోదీ పాల్గొనడంపై జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆ దృశ్యాలు కొంత కలవరపెట్టేలా కనిపించాయన్నారు. మీడియా కవరేజ్ లేకుండా కార్యక్రమం జరిగి ఉంటే ఆందోళన రేకెత్తేది కాదని చెప్పారు. చంద్రచూడ్ నిజాయితీపరుడని, కోర్టు వ్యవహారాలపై PMతో ఎప్పుడూ చర్చించలేదని పేర్కొన్నారు. కాగా జస్టిస్ రాయ్ నిన్న పదవీ విరమణ చేశారు.

News February 3, 2025

ఫిబ్రవరి 03: చరిత్రలో ఈ రోజు

image

✒ 1468: అచ్చుయంత్రాన్ని కనుగొన్న జోహన్నెస్ గుటెన్‌బర్గ్ మరణం
✒ 1938: బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ జననం
✒ 1963: RBI 23వ గవర్నర్‌ రఘురాం రాజన్ జననం
✒ 1954: UP మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 800 మంది మృతి
✒ 2002: ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి మరణం(ఫొటోలో)
✒ నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం