News August 2, 2024

NLG: దరఖాస్తులు 2,05,494.. రూ.20 కోట్లకు పైగా ఆదాయం

image

ఎల్ఆర్ఎస్‌కు ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉండగా అందులో నందికొండ మినహా మిగతా మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్‌కు 2,05,494 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ఫీజు వసూలు చేశారు. దీంతో ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలోనే 20 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

Similar News

News September 14, 2025

రేపు పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు: SP

image

జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గవర్నర్ పర్యటన భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలందరూ విషయాన్ని గమనించగలరని కోరారు. తదుపరి గ్రీవెన్స్ డే యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.

News September 14, 2025

రేపు MGU 4వ స్నాతకోత్సవం

image

నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. సోమవారం యూనివర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో 22 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు PHD పట్టాలు, 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నారు. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 150 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ లభించాయి.

News September 14, 2025

NLG: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో అధికారుల సమీక్ష రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు రేపు ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె కోరారు. వచ్చే సోమవారం ప్రజావాణి యథావిధిగా జరుగుతుందని పేర్కొన్నారు.