News August 2, 2024
ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి నాంది పలికింది ప్రకాశం జిల్లా

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పోరాటానికి నాంది పలికింది ప్రకాశం జిల్లా యువకులు. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలో 13 మంది మాదిగ యువకులు 1994 జూన్ 7న ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనికి మందకృష్ణ మాదిగ వ్యవస్థాపకుడిగా పోరాడారు. 1995 మే 31న ఒంగోలులో 70 వేల మందితో ఎమ్మార్పీఎస్ తొలి సమావేశం జరిగింది.
Similar News
News March 16, 2026
పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన SP

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఆయన త్యాగం ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు.
News March 16, 2026
మార్కాపురం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే: జేసీ

మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో రాసి అధికారులకు సమర్పించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్జీలపై అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు.
News March 16, 2026
మార్కాపురం కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే: జేసీ

మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో రాసి అధికారులకు సమర్పించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్జీలపై అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు.


