News August 2, 2024
ఒలింపిక్స్లో మెడల్స్.. ఏడింతలు పెరిగిన బ్రాండ్ వాల్యూ!

ఒలింపిక్స్లో సంచలనం సృష్టించిన భారత క్రీడాకారిణి మను భాకర్ ఇమేజ్ను వాడుకునేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఒలింపిక్స్ మెడలిస్ట్తో ప్రకటనల కోసం దాదాపు 40 బ్రాండ్స్ ఆమె టీమ్ను సంప్రదించాయట. ఇప్పుడు ఆమె బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరిగిందని, గతంలో రూ.20 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.1.5 కోట్లకు పెరిగినట్లు సమాచారం. కాగా, అనధికారికంగా తన ఫొటోను వాడుకున్న కంపెనీలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
Similar News
News February 1, 2026
గుంటూరు జిల్లాలో 45 పోస్టులు.. అప్లై చేశారా?

AP: గుంటూరు జిల్లాలోని UPHC, PHCలో ఖాళీగా ఉన్న 45 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, DMLT, BSc(BZC), PG డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), D.ఫార్మసీ, B.ఫార్మసీ, M.ఫార్మసీ, PGDCA అర్హతగల వారు <
News February 1, 2026
సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్న నిర్మల

కేంద్ర మంత్రి నిర్మల 75 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్నారు. 2 భాగాల బడ్జెట్లో పార్ట్ Aకు సాధారణంగా ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక స్థితిని సమీక్షించే, విధాన దిశను నిర్దేశించే ముఖ్యమైన అంశాలు అందులో ఉంటాయి. పన్ను సంబంధిత ప్రకటనలకే పార్ట్Bని పరిమితం చేస్తారు. ఈ సారి పార్ట్ B ద్వారానే ఇండియా ఎకనమిక్ విజన్ను నిర్మల ఆవిష్కరించనున్నారు. ట్రేడ్, కస్టమ్స్, ఎగుమతులు, తయారీపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.
News February 1, 2026
నిద్ర లేవగానే ఎన్ని నీళ్లు తాగాలి?

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఎన్ని తాగాలనే దానిపై పలువురికి సందేహం ఉంటుంది. వైద్యుల సూచన మేరకు ఖాళీ కడుపుతో 1-2 గ్లాసుల(సుమారు 500ML) వరకు తాగొచ్చు. ఇది రాత్రంతా డీహైడ్రేషన్కు గురైన శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎక్కువగా తాగితే కిడ్నీలపై భారం పడుతుంది. కడుపు ఉబ్బరం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలొస్తాయి.


