News August 2, 2024
యువతిపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న శివాజీ రెడ్డిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి యువతి(24)పై అత్యాచారం జరిగింది. ప్రధాన నిందితుడైన గౌతంరెడ్డి మంగళవారం రాత్రి అరెస్టయ్యాడు. మరో నిందితుడైన శివాజీ రెడ్డి గుంటూరుకు పారిపోయాడు. గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. శివాజీ రెడ్డి స్వగ్రామం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని ఆరెగూడెం.
Similar News
News March 13, 2025
NLG: యువ వికాసంపై చిగురిస్తున్న ఆశలు

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ఉపాధి కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో కొత్త పథకానికి కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం 30వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఉపాధి కల్పిస్తేనే పథకం విజయవంతం అవుతుందని అంటున్నారు.
News March 13, 2025
GOOD NEWS.. హైదరాబాద్లోకి నల్గొండ జిల్లా

హైదరాబాద్ విస్తరణ పరిధి పెరగనుంది. HMDA స్థానంలో HYD మెట్రోపాలిటన్ రీజియన్(HMR)ను ప్రభుత్వం తీసుకురానుంది. త్వరలో RRR అందుబాటులోకి రానుండడంతో ఫ్యూచర్లో అవసరాల కోసం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలోని 31 గ్రామాలను HMR పరిధిలోకి ప్రభుత్వం తీసుకురానుంది. సెమీ అర్బన్గా పరిగణిస్తూ వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.
News March 13, 2025
NLG: 368 మంది విద్యార్థులు గైర్హాజరు: DIEO

ఇంటర్మీడియట్ సెకండియర్ గణితం, బోటనీ, సివిక్స్ పరీక్షలు నల్గొండలో ప్రశాంతంగా ముగిశాయని DIEO దస్రూనాయక్ తెలిపారు. 13,511 మంది విద్యార్థులకు గాను 13,143 మంది హాజరయ్యారన్నారు. 368 మంది పరీక్షలకు ఆబ్సెంట్ అయినట్లు చెప్పారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.