News August 2, 2024
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి: CM

AP: రైతాంగానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపర్చాలని సూచించారు. ‘సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విధానంపై ప్రణాళికలు రూపొందించాలి. డిమాండ్కు తగ్గట్టుగా, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకు చర్యలు తీసుకోవాలి’ అని చెప్పారు.
Similar News
News January 21, 2026
పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.
News January 21, 2026
APPLY NOW: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(<
News January 21, 2026
మొబైల్ లేకున్నా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది. దీంతో మొబైల్ లేకపోయినా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. గ్రూప్ కాల్లో 32 మంది మాత్రమే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంప్యూటర్/ల్యాప్టాప్లో ఏ అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోకుండానే కాల్స్లో కనెక్ట్ కావచ్చు. వాట్సాప్ వెబ్ యూజర్లకు 2 వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.


