News August 2, 2024
ప.గో: డీఈఎల్ఈడీ ఫలితాలు విడుదల
ఉమ్మడి ప.గో జిల్లాలో జూన్ 24 నుంచి 27 వరకు జరిగిన డీఈఎల్ఈడీ ఫోర్త్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ఏలూరు డీఈవో అబ్రహం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంబంధించిన డమ్మీ మెమోను “www.bse.ap.gov.in” వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. రీకౌంటింగ్ కొరకు సీఎఫ్ఏంఎస్ ద్వారా రూ.500 చెల్లించి దరఖాస్తుతో చలానా, మెమోను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం విజయవాడకు పంపాలన్నారు. SHARE IT..
Similar News
News September 30, 2024
ప.గో: విషాదం.. కరెంట్ షాక్తో ITI విద్యార్థి మృతి
ప.గో జిల్లా ఆకివీడులో విషాదం నెలకొంది. కరెంట్ షాక్తో సాయినగర్కు చెందిన యారపాటి హేమంత్(19) మృతి చెందాడు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గణపతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయినగర్లో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో హేమంత్కు విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హేమంత్ ITI చదువుతున్నాడు.
News September 30, 2024
విషాదం.. 18వ అంతస్తు నుంచి దూకి తల్లీకూతుళ్ల సూసైడ్
భీమవరంలో విషాదం నెలకొంది. 3ఏళ్ల కుమార్తెతో కలిసి 18వ అంతస్తు నుంచి దూకి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మానస(30) భర్త, కూతురు కృషితో కలిసి HYDలోని నార్సింగి సమీపంలో నివాసం ఉంటోంది. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి మానస కూతురితో కలిసి బిల్డింగ్ పైనుంచి దూకేసింది. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 30, 2024
బాగా చదవాలన్నందుకు కాలువలో దూకిన విద్యార్థి
బాగా చదివి పదో తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పినందుకు ఓ విద్యార్థి కాలువలో దూకేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారావుకు కుమారుడు పోలినాయుడు(16), కుమార్తె సంతానం. ఆదివారం కుమార్తె పుట్టిన రోజు వేడుకలను పెద్దింటమ్మ ఆలయం వద్ద నిర్వహించారు. ఈ క్రమంలో పేరెంట్స్, బంధువులు ‘పది’లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పోలినాయుడితో అనగా.. మనస్తాపానికి గురై వెళ్లి కాలువలో దూకేశాడు.