News August 2, 2024
వయనాడ్ విపత్తు: సైంటిస్టులు మాట్లాడొద్దన్న ‘కేరళ ఆర్డర్’ వెనక్కి

వయనాడ్ విపత్తుపై సైంటిస్టులు మాట్లాడకుండా, పరిశోధనలు చేయకుండా తీసుకొచ్చిన ఆర్డర్ను కేరళ సర్కారు వెనక్కి తీసుకుంది. విమర్శలకు తలొగ్గింది. ‘సైంటిఫిక్ కమ్యూనిటీ స్టడీస్ అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు. మీరు అభిప్రాయాలు చెప్పొద్దనే ఈ నిర్ణయం. ఈ సమస్యాత్మక సందర్భంలో మీ మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ప్రజలు భయపడొచ్చు’ అని ఆగస్టు 1న CS వేణు అన్నారు. కాగా ఈ విపత్తులో మానవ తప్పిదం ఉందని కొందరి వాదన.
Similar News
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.
News March 3, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

<


