News August 3, 2024
మదనపల్లె వైస్ ఛైర్మన్పై ఏడు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు

మదనపల్లె సబ్ కలెక్టరేట్లో పైళ్ల దగ్ధం కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఫైళ్ల దగ్ధంకు సంబంధించి మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింక వెంకటచలపతిపై వన్ టౌన్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. జింక చలపతిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిపై కేసులు నమోదు కాగా మాధవ రెడ్డి, బాబ్జాన్ తదితరులు పరారీలో ఉన్నారు.
Similar News
News November 14, 2025
అప్పినపల్లి వాసులకు పవన్ ప్రశంస

పెద్దపంజాణి(M) <<18282463>>అప్పినపల్లి<<>> వద్ద గ్రామస్థులు ఎర్రచందనం వాహనాన్ని అధికారులకు పట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై Dy.CM పవన్ X వేదికగా స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్చలు ఫలిస్తున్నాయన్న ఆయన ఇందుకు సహకరించిన గ్రామస్థులను ఎక్స్ వేదికగా అభినందించారు. వారి చొరవ, ధైర్యాన్ని పవన్ మెచ్చుకున్నారు.
News November 14, 2025
ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యం: SP

ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసు శాఖ ధృడ సంకల్పమని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. చిత్తూరులోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను శుక్రవారం ఆయన పరిశీలించారు. సీసీ కెమెరాల నియంత్రణ, ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం వంటి అంశాలను పరిశీలించారు. డయల్ 112 విభాగాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కాల్ ఎంతో ముఖ్య ఉంటుందని చెప్పారు.
News November 14, 2025
సోమల: ట్రాక్టర్ కిందపడి కూలి మృతి

దుక్కులు దున్నుతూ ట్రాక్టర్ కింద పడి కూలి మృతి చెందిన ఘటన సోమల మండలంలో జరిగింది. ఎస్ఐ శివశంకర్ కథనం మేరకు.. బోనమందకు చెందిన రామచంద్ర (43) మామిడి తోటలో కూలిగా పని చేస్తున్నాడు. తోటలో ట్రాక్టర్ దుక్కులు దున్నుతుండగా డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు గుంతలో దిగి ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ కింద పడడంతో రామచంద్ర మృతి చెందాడు. డ్రైవర్ దూకి వేయడంతో అతనికి ప్రమాదం తప్పింది.


