News August 3, 2024

రేషన్ షాపుల్లో మరిన్ని సరకులు: చంద్రబాబు

image

APలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీంతో రేషన్ షాపుల్లో మరిన్ని సరకులు తక్కువ ధరకు అమ్మాలని CM సూచించారు. TDP హయాంలో రేషన్‌లో ఇచ్చిన సరకులను మళ్లీ పునరుద్ధరించాలని చెప్పారు. వ్యవసాయ, సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Similar News

News January 21, 2026

FEB 15 తర్వాత మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: CM CBNతో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ భేటీ అయ్యారు. అనకాపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. FEB 15 తరువాత ప్లాంటుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఆలోపు భూసేకరణ, అనుమతులు పూర్తి చేయాలని CM అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు సాధించాలని మంత్రులు లోకేశ్, టీజీ భరత్‌లకు సూచించారు.

News January 21, 2026

కిషన్ రెడ్డి గారూ ఇది మీ అజ్ఞానమా… లేక: KTR

image

TG: సింగరేణి స్కామ్‌లో ప్రధాన దోషే CBI <<18916865>>విచారణ<<>> కోరాలని ఆశించడం మూర్ఖత్వం కాదా అని కిషన్ రెడ్డిపై KTR మండిపడ్డారు. ‘సీఎం అక్రమ పద్ధతితో తన బావమరిదికి టెండర్‌ను కట్టబెట్టారు. దొంగే PSకు వచ్చి తనపై విచారణ జరపాలని కోరతాడా? BRS బయటపెట్టిన సింగరేణి స్కామ్‌పై కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి తీరు అలాగే ఉంది. ఇది మీ అజ్ఞానమా లేక రేవంత్‌తో బీజేపీకున్న చీకటి ఒప్పందమా’ అని ప్రశ్నించారు.

News January 21, 2026

జగన్ పాదయాత్ర కామెంట్లపై పార్థసారథి కౌంటర్

image

AP: పాదయాత్ర చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ ఒకసారి పాదయాత్ర చేస్తే ఏపీ ఎంతో నష్టపోయింది. మరోసారి చేయడం వలన రాష్ట్రం ఏమైపోతుందో. ప్రజలను ఒకసారి మోసం చేయొచ్చు.. మళ్లీ మళ్లీ మోసం చేయడం అసాధ్యం’ అని ఆయన విమర్శించారు. కాగా ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని <<18916311>>జగన్<<>> ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే.