News August 3, 2024

కోటబొమ్మాళి: విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడి మృతి

image

కోటబొమ్మాళి మండలం రాయిపాడు గ్రామానికి చెందిన విశ్రాంతి తెలుగు ఉపాధ్యాయులు, ప్రముఖ ప్రవచనకారులు కోట రామారావు శుక్రవారం అనారోగ్యంతో తన స్వగ్రామంలో మృతి చెందారు. ఈయన మృతి పట్ల ప్రవచనకారులు సనపల కరుణ్‌కుమార్‌, ఎంపీపీ రోణంకి ఉమామల్లేశ్వరరావు, పేడాడ వెంకటరావు, బమ్మిడి గణపతి స్వామిలతో పాటు పలువురు ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి పరామర్శించారు.

Similar News

News March 18, 2026

శ్రీకాకుళం జిల్లా మార్కెట్లలో మామిడికాయల కొరత

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది మామిడికాయల కొరత ఏర్పడింది. మార్కెట్లో కిలో మామిడి రూ.120-150 పలుకుతోంది. ఒక్కో కాయ సైజును బట్టి రూ.20-50కి కూడా అమ్ముతున్నారు. ధరలు పెరిగినా పండుగ కోసం వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. మంచు ప్రభావం, వాతావరణ మార్పులు వలన పంట లేట్ అయిందని హార్టికల్చర్ అధికారులు తెలిపారు. మీ ఏరియాలో మామిడి ధర ఎలా ఉందొ కామెంట్ చేయండి.

News March 18, 2026

మెక్సికోలో సిక్కోలు యువకుడి మృతి

image

గార మండలం అంపోలు గ్రామానికి చెందిన నాగుబిల్లి వెంకట ధర్మారావు(28) అనే యువకుడు మెక్సికోలో మృతిచెందినట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన యువకుడు కొన్నేళ్లుగా మెక్సికోలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాత్రి తాను ఉండే రూమ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి తల్లిదండ్రులు మంగళగిరిలో వలస కూలీలుగా ఉన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 18, 2026

శ్రీకాకుళం: చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

బూర్జ గ్రామానికి చెందిన పీ.వీరమల్లేశ్వరరావు(65) చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు వివరాలు మేరకు.. ఈనెల 5వ తేదీన అయ్యవారిపేటలో జరుగుతున్న అమ్మవారి పండగల్లో డ్యాన్స్ ప్రోగ్రాం చూసేందుకు వెళ్లిన వీరమల్లేశ్వరరావు తిరిగి ఇంటికి రాలేదు. మంగళవారం తోటాడ గ్రామంలోని చెరువులో ప్రమాదవశాత్తు పడిపోవడంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. ఘటనపై బూర్జ పోలీసులు కేసు నమోదు చేశారు.