News August 3, 2024
Olympics: ‘మను’ చరిత్ర సృష్టించేనా?

ఇప్పటికే 2 పతకాలు సాధించిన షూటర్ మనూ భాకర్ ఇవాళ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఉమెన్స్ 25m. పిస్టల్ ఫైనల్ ఈవెంట్లో ఆమె పోటీ పడనున్నారు. ఇందులో మెడల్ గెలిస్తే ఒకే ఒలింపిక్స్లో భారత్ తరఫున 3 పతకాలు సాధించిన ఏకైక వ్యక్తిగా మను చరిత్ర సృష్టించనున్నారు. ఇక షూటింగ్లో అనంత్జీత్, మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్, ఆర్చరీలో దీపికా కుమారి, భజన్ కౌర్ బరిలో ఉన్నారు. పూర్తి షెడ్యూల్ కోసం పైన ఫొటోలు చూడొచ్చు.
Similar News
News March 11, 2026
వచ్చే నెలలో Xలో పేమెంట్ ఆప్షన్?

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో త్వరలో ఫోన్ పే, గూగుల్ పే తరహాలో పేమెంట్ ఆప్షన్స్ రానున్నాయి. వచ్చే నెలలో పరిమిత యూజర్లకు దీని ఎర్లీ యాక్సెస్ అందుబాటులో ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనిపై X ఇప్పటికే వీసా సంస్థతో టైయప్ అయింది. కాగా Xను SM కంటే ఫైనాన్స్కు ప్రాధాన్యం ఉన్న ప్లాట్ఫామ్గా మారుస్తానని మస్క్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ట్రయల్స్ ఓకే అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.
News March 10, 2026
గ్యాస్ కొరత.. మొబైల్, ఇంటర్నెట్పై ఎఫెక్ట్?

LPG కొరతతో మొబైల్, ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై నిలిచిపోవడమే ఇందుకు కారణం. టెలికం టవర్లు తుప్పుపట్టకుండా తయారీ సమయంలో జింక్తో వేసే రక్షణ పొరకు LPG/LNG అవసరం. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్కు తగిన LPG లేకపోతే ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీంతో నెట్వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని తెలిపారు.
News March 10, 2026
రణ్వీర్ అప్కమింగ్ మూవీపై క్రేజీ అప్డేట్!

‘ధురంధర్-2’పై భారీ అంచనాలు నెలకొన్న వేళ రణ్వీర్ సింగ్ నెక్స్ట్ మూవీపై ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రణ్వీర్ ఈసారి ‘ప్రళయ్’ పేరుతో ఓ జాంబీ థ్రిల్లర్లో నటించనున్నారు. ఇలాంటి సినిమాను భారత్లో ఎవరూ తీయలేదని.. కనీవినీ ఎరుగని రేంజ్లో ఉంటుందని డైరెక్టర్ జై మెహతా చెప్పడంతో అంచనాలు పెరిగాయి. రణ్వీర్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ ఫిల్మ్లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది.


