News August 3, 2024
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రీతమ్(27) భిక్కనూరు(M) TU పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో వీడ్కోలు సమావేశం ఉండడంతో పనుల నిమిత్తం శుక్రవారం బయటికి వెళ్లాడు. బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో ప్రీతమ్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లా బేల(M) సాంగిడికి చెందిన వాడని తోటి విద్యార్థులు తెలిపారు.
Similar News
News March 11, 2026
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి: సీపీ సాయి చైతన్య

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పోలీస్ శాఖ అమలు చేయాల్సిన 99 రోజుల కార్యక్రమాలపై సీపీ సాయి చైతన్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బంది కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా గ్రామాలను సందర్శించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News March 10, 2026
NZB: ఇంటర్ పరీక్షలు.. 377 మంది గైర్హాజరు

NZB జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం భౌతికశాస్త్రం, అర్ధ శాస్త్రం, ఒకేషనల్ పరీక్షలకు 377 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DIEO రవికుమార్ తెలిపారు. మొత్తం 16,678 మంది విద్యార్థులకు గాను 16,301 మంది హాజరయ్యారన్నారు. జనరల్లో 14,305మంది విద్యార్థులకు గాను 13,997 మంది విద్యార్థులు, ఒకేషనల్లో 2,373 మంది విద్యార్థులకు గాను 2,304 మంది పరీక్షలు రాశారు.
News March 10, 2026
NZB: తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యం

కోటగిరి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(27) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. స్థానికంగా, బంధువుల వద్ద వెతికినా వారి ఆచూకీ లభించలేదని భర్త గంగాధర్ పేర్కొన్నారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సాయిలు(27) హోటల్కు వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై సునీల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


