News August 3, 2024
డీఎస్సీ అభ్యర్థులకు ALERT.. టెట్ దరఖాస్తుకు ఇవాళే లాస్ట్

AP: రాష్ట్రంలో టెట్ దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. ఇప్పటికే ఓ సారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. SEP 22 నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. OCT 3 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫైనల్ కీని అక్టోబర్ 27న, ఫలితాలను నవంబర్ 2న విడుదల చేస్తారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
వెబ్సైట్: <
Similar News
News March 10, 2026
4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. వారంలో షెడ్యూల్?

అస్సాం, కేరళ, WB, TN, పుదుచ్చేరి(UT)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. EC వారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం CEC జ్ఞానేశ్ కుమార్ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. స్థానిక పండుగలను పరిగణనలోకి తీసుకోవాలని పలు పార్టీలు ECకి విజ్ఞప్తి చేశాయి. కాగా బెంగాల్లో ఎన్నికలను రెండు దశల్లోనే పూర్తి చేయాలని TMC, BJP, INC, CPM, AAP నేతలు కోరారు.
News March 10, 2026
ఇండియా వల్ల క్రికెట్ భ్రష్టుపట్టింది: అక్తర్ అక్కసు

భారత్ T20WC గెలవడంపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఆధిపత్యం వల్ల ఆట భ్రష్టుపట్టిందని అక్కసు వెళ్లగక్కారు. ‘ఓ రిచ్ కిడ్ తన పక్కనున్న పేదపిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం అన్నట్లుగా ఉంది ఇండియా వ్యవహారం’ అని విమర్శించారు. ఫైనల్కి ముందు కూడా ‘క్రికెట్ మంచి కోసం న్యూజిలాండ్ గెలవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఆయనపై ఇండియన్ ఫ్యాన్స్ SMలో ఫైర్ అవుతున్నారు.
News March 10, 2026
వార్ విజువల్స్ షేర్ చేస్తే జైలుకే!

సౌదీలో ఎయిర్ కండీషనర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఏపీలోని మదనపల్లెకు చెందిన యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అనధికార యుద్ధ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఇందుకు కారణం. అటు ఖతర్లోనూ యుద్ధానికి సంబంధించిన వీడియోలు తీశారని, అనధికార సమాచారాన్ని ఫార్వర్డ్ చేశారని 313 మందిని అరెస్ట్ చేశారు. UAEలోనూ వార్ విజువల్స్ రికార్డు/షేర్ చేయడం నేరంగా పరిగణిస్తారు. 1-2 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు.


