News August 3, 2024
ఆర్టీపీపీలో క్రేన్ ఢీకొని కాంట్రాక్టు లేబర్ వ్యక్తి మృతి

ఎర్రగుంట్ల మండల పరిధిలోని ఆర్టీపీపీలో శుక్రవారం సాయంత్రం క్రేన్ ఢీకొని, ముద్దనూరు చెందిన ఖాదర్ బాషా(49) అనే కాంట్రాక్ట్ లేబర్ తీవ్రంగా గాయపడి పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు శనివారం ఉదయం నుంచి ఆర్టీపీపీలో ఆందోళన చేస్తున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
Similar News
News March 5, 2026
కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,236 మంది హాజరు.!

కడప జిల్లాలో గురువారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు, హిందీ, ఉర్దు పరీక్షలు నిర్వహించారు. నేడు 5,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 5,326 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. తెలుగు 5,086 మంది, హిందీ 68 మంది, ఉర్దు పరీక్ష 82 మంది రాశారు. డీఈఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.
News March 5, 2026
కడప: ఇంటర్ పరీక్ష.. ఇవాళ ఎంతమంది రాశారంటే.!

కడప జిల్లాలో గురువారం 62 కేంద్రాల్లో ఇంటర్ 1st ఇయర్ జువాలజీ, గణితం పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. నేటి పరీక్షలకు 6,561 మందికి గాను.. 6,029 మంది (92%) హాజరయ్యారు. 532 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 5,208 మందికి గాను.. 4,834 మంది పరీక్షలు రాశారు. 374 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,353 మందికి గాను.. 1,195 మంది పరీక్షలు రాశారు.
News March 5, 2026
పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: కడప కలెక్టర్

కడప జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తేవాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో టూరిజం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చారిత్రక, పర్యటక, దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని.. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పర్యాటక రంగం ప్రధాన భూమిక పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో JC, టూరిజం అధికారులు పాల్గొన్నారు.


