News August 3, 2024
GHMC: 225 బస్తీ దవాఖానల్లో ఉచిత పరీక్షలు

ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, ఇతర వ్యాధులను కట్టడి చేయగలమని HYD నగరంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగూ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నగరంలోని 225 బస్తీ దవాఖానాల్లో జ్వరాలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. నీరసం, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారు బస్తీ దవాఖానల్లో చూపించుకోవాలని సూచించారు.
Similar News
News January 11, 2026
HYD: కార్పొరేషన్ కోసం లష్కర్లో లడాయి

GHMCని 3గా విభజించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ లేదా లష్కర్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడుతోంది. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ను విస్మరించడం తగదని స్థానికులు, BRS నేతలు మండిపడుతున్నారు. HYD- సికింద్రాబాద్ జంట నగరాలుగా పేరొందగా, సికింద్రాబాద్ పేరు లేకుండా పునర్వ్యవస్థీకరణ సరికాదంటున్నారు. సర్కార్ దిగొచ్చి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉద్యమం ఉద్ధృతం అయింది.
News January 11, 2026
HYD: ఆ నలుగురు లేకపోయినా!

ఎవరైనా కన్నుమూస్తే పాడె కట్టి నలుగురు మోసే అంతిమయాత్ర మన సంప్రదాయం. అయితే కాలానికి తగ్గట్టు ఆ విధానానికి ముగింపు పడుతోంది. పాడె మోయడానికి బదులుగా ‘పరమపద వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. మృతదేహాన్ని సురక్షితంగా తరలించడమే కాకుండా, కుటుంబ సభ్యులు కూర్చునే సౌకర్యం కల్పించారు. శ్మశానం వరకూ గౌరవంగా అంతిమయాత్ర నిర్వహించేలా ఈ వాహనాలు మార్గం చూపుతున్నాయి. ఆ నలుగురు లేనివారికి.. ఆఖరి మజిలీ సగౌరవంగా సాగుతోంది.
News January 11, 2026
HYD: GHMCలో విలీనం.. ఇక కుదరదు

GHMCలో మున్సిపాలిటీల విలీనం తర్వాత అనధికారిక హోర్డింగులు, బ్యానర్లు, ప్రకటనా నిర్మాణాలపై అధికారులు నగరవ్యాప్త స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు. ప్రజా, రోడ్డు భద్రత, నగర సౌందర్యం కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అన్నీ జోన్లలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన GHMC దశలవారీగా నిరంతరం ఈ డ్రైవ్ను చేపడుతుంది. అనధికారిక ప్రకటనలను ఏర్పాటు చేస్తే కఠినచర్యలు చేపడతామని హెచ్చరించింది.


