News August 3, 2024

ఆ అధికారులను వదిలిపెట్టను: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో భూ అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలిపెట్టనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ప్రజాదర్బార్‌లో సీఎం మాట్లాడారు. ‘రెవెన్యూ సమస్యలపైనే ప్రజల నుంచి అధిక ఫిర్యాదులు వచ్చాయి. మండలానికో భూ కుంభకోణం వెలుగులోకి వస్తోంది. వైసీపీ నేతలతో కలిసి కొంతమంది అధికారులు రికార్డులను తారుమారు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News March 22, 2026

F-16 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చిందా?

image

ఇరాన్ ఎయిర్‌స్పేస్‌లో జరిగిన ఆపరేషన్‌లో తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇజ్రాయెల్‌కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయని IRGC ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ ఈ వాదనను కొట్టిపారేసింది. తమ విమానంపై క్షిపణి దాడి జరిగిన మాట వాస్తవమేనని, కానీ పైలట్లు సేఫ్‌గా మిషన్‌ను పూర్తి చేసి తిరిగి వచ్చారని స్పష్టం చేసింది. విమానానికి ఎలాంటి డ్యామేజ్ కాలేదని పేర్కొంది.

News March 22, 2026

‘చచ్చాడు.. సంతోషం’: ట్రంప్ నోటి దురుసు!

image

అమెరికాలో FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. 9/11 దాడుల తర్వాత FBI రూపురేఖలు మార్చిన ఆయన ట్రంప్-రష్యా సంబంధాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ట్రంప్.. ముల్లర్ చనిపోగానే ‘చచ్చాడు.. చాలా సంతోషం. ఇక అమాయకులను వేధించలేడు’ అని అన్నారు. ఒక లెజెండరీ ఆఫీసర్ అంటూ చాలా మంది సంతాపం తెలుపుతుంటే ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.

News March 22, 2026

కుల మీటింగ్స్‌కు వెళ్తే తప్పేంటి?: హైడ్రా కమిషనర్

image

కుల సమావేశాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ‘భారతదేశంలో కులాన్ని విడదీయలేం. మంచి విషయాల కోసమే వెళ్తున్నాను’ అని స్పష్టం చేశారు. తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని కేవలం ప్రజల్లో అవగాహన కోసమే ఇంటర్వ్యూలు ఇస్తున్నానని చెప్పారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని తెలిపారు.