News August 3, 2024

ప.గో: దారుణం.. చోరీకి వెళ్లి వృద్ధురాలిపై అత్యాచారం

image

వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేయాలని చూసిన ఇద్దరిని పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ప.గో SP ఆద్నాన్ నయీం అస్మీ వివరాల ప్రకారం.. గత నెల 29న పాలకొల్లులోని ఓ ఇంటిలో బొక్కా రాజు, మీసాల మావుల్లు చోరీకి వెళ్లారు. ఇంట్లో ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు లాక్కున్నారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు ఈరోజు నిందితులను అరెస్ట్ చేశారు.

Similar News

News November 2, 2025

ఉండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఉండి మండలం నక్కరాజగుంట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండి నుంచి ఆకివీడు వెళుతున్న గంధం రాఘవులు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News November 2, 2025

బియ్యం బస్తా మోసిన ఎమ్మెల్యే నాయకర్

image

తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన వేములదీవిలో శనివారం నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో 50 కేజీల బియ్యం బస్తా, ఇతర సరుకులను ఇంటికి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగురాలిని ఎమ్మెల్యే నాయకర్ గమనించారు. వెంటనే ఆయనే స్వయంగా బియ్యం బస్తాతో సహా సరుకులన్నింటినీ తన భుజాలపై మోసుకుని, ఆమె త్రిచక్ర వాహనం వరకూ చేర్చారు. ఆపదలో ఉన్న బాధితురాలికి ఎమ్మెల్యే చేసిన సాయం ఆదర్శంగా నిలిచింది.

News November 2, 2025

నరసాపురం: ‘లోక్ అదాలత్‌పై దృష్టి సారించాలి’

image

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి అన్నారు. ఈ మేరకు శనివారం నరసాపురం కోర్టు హాలులో పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయవాదులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమ న్యాయం అందించడానికి పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.