News August 3, 2024

టెలికం సర్వీస్ ఔటేజ్: కస్టమర్లకు పరిహారం ఇవ్వాల్సిందే

image

టెలికం, బ్రాడ్‌బ్యాండ్ నాణ్యతా ప్రమాణాలను ట్రాయ్ సవరించింది. సేవలు నిలిస్తే కస్టమర్లకు పరిహారం ఇవ్వాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. ఏ ఒక్క క్వాలిటీ ప్రమాణం అందుకోకున్నా వేసే ఫైన్‌ను ₹50K-₹1Lకు పెంచింది.
* 2G/3G/4G/5G మొబైల్ కవరేజీ మ్యాపుల్ని వెబ్‌సైట్లో చూపాలి
* నెట్‌వర్క్ ఆగితే ప్రీపెయిడ్‌, పోస్టుపెయిడ్‌ను బట్టి వ్యాలిడిటీ, రిబేట్ ఇవ్వాలి
* ఏడాదిలో 12Hrs ఔటేజ్‌ను ఒక రోజుగా పరిగణిస్తారు.

Similar News

News January 24, 2026

మీడియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ

image

అదానీ గ్రూప్ మీడియా రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌ (Indo Asian News Service)లో మిగిలిన 24% వాటాను కొనుగోలు చేసింది. దీంతో IANS పూర్తిగా అదానీ గ్రూప్ సంస్థగా మారింది. ఇప్పటికే 2023 డిసెంబరులో 50.5% ఉన్న వాటాను 2024 జనవరిలో 76 శాతానికి పెంచుకున్నారు. NDTV, బీక్యూ ప్రైమ్ తర్వాత ఐఏఎన్‌ఎస్‌ కూడా చేతికి రావడంతో మీడియాలో అదానీ ప్రభావం మరింత పెరగనుంది.

News January 24, 2026

బెంగాల్‌లో SIRపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అసంతృప్తి

image

WBలో నిర్వహిస్తున్న SIRపై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో హడావిడిగా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందన్నారు. ‘ఓటర్ల జాబితాను సమీక్షించాలనుకోవడంలో తప్పులేదు. ప్రస్తుతం బెంగాల్‌లో జరగుతున్నది అలా లేదు. ఓటు హక్కు నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్‌ అందించడానికి తగిన సమయమివ్వాలి’ అని చెప్పారు.

News January 24, 2026

776 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు!

image

TG: ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధుల్లో చేరారు. దీంతో ఆ స్థానాల్లో ఉన్న 776 మంది తాత్కాలిక(కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) సిబ్బందిని తొలగించాలని ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కాలేజీలు, ఆసుపత్రులలో వారి సేవలను నిలిపివేస్తున్నట్లు DME ప్రకటించారు. రెగ్యులర్ నియామకాలు పూర్తికావడంతో వీరిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.