News August 3, 2024
కేంద్ర మంత్రిని కలిసిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని శ్రీకాకుళం ఎస్పీ కే.మహేశ్వరరెడ్డి శనివారం కలిశారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మహిళా సంరక్షణ, లా అండ్ ఆర్డర్ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీతో కేంద్ర మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. యువత పెడదారిన పడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఈ భేటీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే ఉన్నారు.
Similar News
News December 25, 2025
శ్రీకాకుళం గడ్డపై వాజ్పేయి ఎన్నికల ప్రచారం.. జ్ఞాపకాల నెమరువేత

1983 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అటల్ బిహారీ వాజ్పేయి శ్రీకాకుళంలో పర్యటించిన అరుదైన జ్ఞాపకాలను జిల్లా బీజేపీ గుర్తు చేసుకుంది. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గ అభ్యర్థి సంపతిరావు రాఘవరావు తరఫున ఆయన ప్రచారం చేశారు. కుష్బూ థాక్రేతో కలిసి జడ్పీ గెస్ట్ హౌస్లో బస చేసిన ఆయన ప్రసంగం ఆనాడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఆ ఎన్నికల్లో రాఘవరావు 14శాతం ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు.
News December 25, 2025
SKLM: రథసప్తమిపై ప్రజాభిప్రాయ సేకరణ రద్దు

రథసప్తమిపై ప్రజల అభిప్రాయ, సలహాల స్వీకరణ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయం గమనించాలి కోరారు.
News December 25, 2025
శ్రీకాకుళం: 9 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

ఇచ్ఛాపురంలో ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి మరో మహిళ సహాయంతో వరుసగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవల వివాహం అనంతరం అనుమానం రావడంతో బాధితుడు ఇచ్ఛాపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్యపెళ్లికూతురుతో పాటు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.బరంపురానికి చెందిన ఒక యువకుడిని పెళ్లిచేసుకుని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.


