News August 4, 2024
సీతంపేట: గిరిజన విద్యార్థులు టెట్, డీఎస్సీకి ఉచిత శిక్షణ

ఐటీడీఏ ఆధ్వర్యంలో టెట్, డీఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను పొందేందుకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ నెల 3 నుంచి 10వ తేదీ లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.
Similar News
News January 9, 2026
శ్రీకాకుళం జిల్లాలో రూ.135.37 కోట్లతో విద్యుత్ ఆధునీకరణ పనులు

శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ ఆధునీకరణ పనులకు రూ 135.37 కోట్లు మంజూరయ్యాయని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. రూ. 80 కోట్లతో శ్రీకాకుళంలో 132/23 కేవీ విద్యుత్ ఉపకేంద్రం చిలకపాలెం-అంపోలు మధ్యలో నిర్మిస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో త్వరితగతిన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు.
News January 9, 2026
కోటబొమ్మాళికి డిగ్రీ కాలేజీ మంజూరు..జిల్లాలో మొత్తం ఎన్నంటే?

శ్రీకాకుళం జిల్లాకు విద్యాశాఖ కోటబొమ్మాళిలో నూతనంగా డిగ్రీ కళాశాల మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(అటానమస్), శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, టెక్కలి, పలాస, బారువ, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, తొగరాం, పొందూరు ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలో ఉన్నాయి. కొత్తది మంజూరు కావడంతో జిల్లాలో మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 13కు చేరుకున్నాయి.
News January 9, 2026
రథసప్తమి వేడుకలకు నేడు అంకురార్పణ కార్యక్రమం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 8 గంటలకు అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.46 నిమిషాల పాటు సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.


