News August 4, 2024
సీతంపేట: గిరిజన విద్యార్థులు టెట్, డీఎస్సీకి ఉచిత శిక్షణ

ఐటీడీఏ ఆధ్వర్యంలో టెట్, డీఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను పొందేందుకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ నెల 3 నుంచి 10వ తేదీ లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.
Similar News
News March 10, 2026
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్పై ACB అదికారుల దాడి

శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో ACB అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ACB సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావుతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఫైళ్లను, ఈ ఆఫీస్ ఫైళ్లను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ శాఖలో అవినీతి ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో ఏసీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫిర్యాదుల మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు.
News March 10, 2026
SKLM: ‘ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి’

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మడు రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.
News March 10, 2026
శ్రీకాకుళం: సామాన్యులపైన యుద్ధం ప్రభావం!

ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రభావం శ్రీకాకుళం జిల్లా ప్రజలపైన పడుతుంది. ప్రభుత్వం ఒకేసారి వంట గ్యాస్ సిలిండర్పై రూ.60, వాణిజ్య సిలిండర్పై రూ.100 పెంచారు. జిల్లాలో 6,95,278 కనెక్షన్లు ఉన్నాయని జిల్లా పౌరసరపరా శాఖ జి.సూర్యప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం వంట గ్యాస్ ధర జిల్లాలో రూ.879.50, వాణిజ్య గ్యాస్ ధర రూ.939.50 ఉంది. మరోపక్క గ్యాస్ డెలివరీ సమయం 25 రోజులకు పెంచారు.


