News August 4, 2024
గుడ్న్యూస్ చెప్పిన BSNL

AP: ఆగస్టు 15 నాటికి ప్రధాన నగరాల్లో 4G సర్వీసులు ప్రారంభిస్తామని BSNL తెలిపింది. సెప్టెంబర్లోగా రాష్ట్రం మొత్తం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో యాంటినాలు, బేస్ ట్రాన్సివర్ స్టేషన్లు, కోర్ నెట్వర్క్ పనులను చేపడుతోంది. మారుమూల గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1200 కొత్త టవర్లు ఏర్పాటు చేస్తోంది. VSP, SKLM, E.G, KNL జిల్లాల్లోని గ్రామాల్లో ఈ నెలాఖరులోగానే 4G సేవలు ప్రారంభించనుంది.
Similar News
News March 19, 2026
రంజాన్ ఎల్లుండే..

భారత్లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
News March 19, 2026
రేపే బడ్జెట్.. ఆరు కొత్త పథకాలు!

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా యంగ్ ఇండియా కిట్స్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, పాడి రైతులకు రాయితీపై పశువుల సరఫరాను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
News March 19, 2026
ఏఐ డీప్ఫేక్ వీడియోలపై ఢిల్లీ హైకోర్టుకు గంభీర్

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు తన పేరు, ఫొటోలు, ఐడెంటిటీని ఆయుధాలుగా వాడుకుంటున్నారని, ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. వాటి వల్ల తన పరువుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. తనపై పోస్టులు చేసిన ఖాతాలు, ఫేక్ కంటెంట్ను తొలగించాలని, రూ.2.5కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.


