News August 4, 2024

ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా చర్యలు: VMRDA కమిషనర్

image

VMRDA పరిధిలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా వినూత్న ప్రాజెక్టులు, ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు కమిషనర్ కేఎస్.విశ్వనాథన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రకృతిని పరిరక్షించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో అదనంగా 500 ఎకరాల్లో ఏరో సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

Similar News

News July 9, 2025

గిరి ప్రదక్షణలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకి చేర్చిన పోలీసులు

image

సింహాచలం “గిరి ప్రదక్షణ”లో పైనాపిల్ కాలనీ సమీపంలో రెండు సంవత్సరాల బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం పోలీసులు గమనించి వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. వెంటనే పోలీసులు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా బాలుడు గుర్తులు తెలియజేస్తూ ప్రకటన చేశారు. బాలుడు తల్లి అది విని సమీపంలో పోలీసులు ద్వారా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆమెకు క్షేమంగా అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News July 9, 2025

అర్ధరాత్రి అప్పన్నకు చందనం సమర్పణ

image

సింహాచలం అప్పన్న స్వామికి అర్ధరాత్రి పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. దీంతో స్వామివారు పరిపూర్ణంగా నిత్య రూపంలోకి మారుతారు. 2 గంటల సమయంలో సుప్రభాత సేవ అనంతరం చందనం సమర్పిస్తారు. అనంతరం 3గంటలకు ఆరాధన, బాల భోగం, రాజ భోగం నిర్వహిస్తారు. గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు తెల్లవారుజామున 5:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి.

News July 9, 2025

‘ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

image

VMRDAకి చెందిన అన్ని కళ్యాణ మండపాల బుకింగ్‌లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. బుధవారం VMRDA బాలల థియేటర్లో ఆయన ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ప్రజలకు VMRDA సేవలు పారదర్శకంగా కల్పించేందుకు ఆన్లైన్ సేవలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్‌లోనే కళ్యాణమండపం రుసుము, తదితర వివరాలు ఉంటాయని పేర్కొన్నారు.