News August 4, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో సన్నాల సాగుకే సై

image

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు వరిలో సన్న రకాల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో సన్న రకం బియ్యానికి మంచి ధర పలుకుతోంది. అంతేకాకుండా ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. ఈసారి వర్షాలు అనుకూలించకపోయినప్పటికీ చాలా మంది రైతులు సన్నరకాల నారు పోశారు. నీటి వసతులు ఉన్నచోట నాట్లు సైతం వేశారు. సాగర్ కూడా నిండుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News September 30, 2024

నల్గొండ: ఏసీబీకి చిక్కిన పశు వైద్యాధికారి

image

చింతపల్లి మండల పశు వైద్యాధికారి జోసఫ్ పాల్ రూ.6,000 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గేదెల బ్యాంకు లోన్, హెల్త్ సర్టిఫికెట్ కోసం నసర్లపల్లికి చెందిన ఓ రైతు వద్ద రూ.8వేలు డిమాండ్ చేసి రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్ కి ఫోన్ చేయాలని ఉమ్మడి ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.

News September 30, 2024

NLG: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
NLG 3187 373 1:08
SRPT 2981 213 1:13
యాదాద్రి 742 135 1:05

News September 30, 2024

NLG: దసరాకు వినూత్నమైన ఆఫర్

image

తెలంగాణలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. NLG జిల్లాలోని శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో యువకులు వినూత్నంగా ‘రూ. 200 కొట్టు మేకను పట్టు’ అనే ఆఫర్ పెట్టారు. ఈ కూపన్ ఆఫర్‌లో మేక, నాటు కోళ్లు, మందు బాటిళ్లు గెలిచిన వారికి బహుమతిగా ప్రకటించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్సై సైదులు తెలిపారు.