News August 4, 2024
కక్షతో నంద్యాలలో మా కార్యకర్తను హత్య చేశారు: వైసీపీ

నంద్యాలలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడిని టీడీపీకి సంబంధించిన వ్యక్తులే హత్య చేసినట్లు వైసీపీ ఆరోపించింది. ‘మహానంది మండలం సీతారామపురంలో సుబ్బారాయుడు వైసీపీ కోసం పని చేశారు. టీడీపీ గూండాలు కక్ష పెట్టుకుని ఇంట్లోకి చొరబడి రాళ్లు, కత్తులతో దాడి చేశారు. సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాష్ట్రంలో ఇంకెన్నాళ్లు ఈ రాక్షసకాండ’ అని ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.
Similar News
News February 15, 2026
రేపు కర్నూలు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీల పరిష్కారం సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి కనుక్కోవచ్చని పేర్కొన్నారు. Meekosam.ap.gov.in అర్జీలు నమోదు చేసుకోవాలన్నారు.
News February 15, 2026
కర్నూలు: నీటి కుంటలో పడి 12 ఏళ్ల బాలుడి మృతి

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ఉత్సాహంతో వెళ్లిన యాత్ర విషాదంగా ముగిసింది. ఆలూరు మండలం తుంబలబీడుకు చెందిన సలువప్ప చిన్న కుమారుడు ఎం.సిద్ధార్థ(12) శివరాత్రి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ ప్రధాన రహదారి పక్కన ఉన్న నీటి కుంటలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 15, 2026
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హెచ్చరిక

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఆళ్లగడ్డ తాలూకా నాయకుడు సజ్జల నాగేంద్ర ఖండించారు. శిరివెళ్లలో ఆయన మాట్లాడుతూ.. చేతనైతే కరవు సీమలో కన్నీళ్లు తుడిచే పనులు చేయాలని బైరెడ్డికి సూచించారు. విలువలతో కూడిన రాజకీయం మీలాంటి ఫ్యాక్షన్ రాజకీయ నాయకులకు అర్థం కాదన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.


